భారత్ అద్భుతమైన ప్రదర్శనపై వీరేంద్ర ట్వీట్.. రాహుల్ గాంధీ వీడియో పెట్టి మరీ..

-

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఇండియా- ఇంగ్లండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అహమ్మదాబాద్ లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 112పరుగులకే కుప్పకూలింది. 49ఓవర్లలో కేవలం 112పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఆరు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ ని ముప్పు తిప్పలు పెట్టారు.

ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాళ్ళ ప్రశంసలు కురిపిస్తున్నారు. మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఒక వీడియో ట్వీట్ పెట్టి మరీ స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అప్పట్లో ఎలక్షన్ ప్రచారాల్లోని రాహుల్ గాంధీ వీడియోని షేర్ చేస్తూ, ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ వచ్చినోళ్ళూ వచ్చి ఔటై పోయారని ట్వీట్ చేసారు. మొత్తానికి అహమ్మదాబాద్ స్టేడియంలో గొప్ప ప్రారంభమే దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news