టీమిండియాకు మ‌రోసారి షాక్.. ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్‌లో నో ప్లేస్

-

టీమిండియా కు ఐసీసీ మ‌రో సారి షాక్ ఇచ్చింది. ప్ర‌తి నెల క్రికెట్ లో ది బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌న చేసిన వారికి ప్లేయ‌ర్ ఆఫి ది మంత్ అవార్డును ఐసీసీ ప్ర‌క‌టిస్తుంది. అయితే వ‌రుస‌గా గ‌త కొద్ది నెల‌ల నుంచి భార‌త్ కు ఈ ప్లేయ‌ర్ ఆఫి ది మంత్ రావ‌డం లేదు. 2021 లో జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌లో వ‌రుస‌గా రిషబ్ పంత్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, భూవ‌నేశ్వ‌ర్ కుమార్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు.

కానీ ఈ మ‌ధ్య కాలంలో టీమిండియా ప్లేయ‌ర్స్ మంచి ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చినా.. ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్క‌డం లేదు. ఈ జ‌న‌వ‌రి నెల‌కు గాను ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ గా మెన్స్ విభాగంలో సౌత్ ఆఫ్రికా బ్యాట‌ర్ కీగ‌న్ పీట‌ర్స‌న్ కు ద‌క్కింది. అలాగు వుమెన్స్ విభాగంలో ఇంగ్లాండ్ మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ హీథ‌ర్ నైట్ గెలుచుకున్నారు. కాగ ఇటీవ‌ల ఐసీసీ ప్ర‌కటించిన ప్లేయ‌ర్స్ ఆఫ్ ది ఇయ‌ర్ లోనూ భార‌త్ కు షాక్ త‌గిలింది. భార‌త్ నుంచి ఒక్క ప్లేయ‌ర్ కూడా ప్లేయ‌ర్స్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు లిస్ట్ లో లేరు.

Read more RELATED
Recommended to you

Latest news