IND vs NZ T20 : టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శ‌ర్మ‌

-

న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న రెండో టీ ట్వంటి మ్యాచ్ లో టీమిండియా టాస్ నెగ్గింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ ఎంచుకుని అతిథ్య న్యూజిలాండ్ ను మొద‌ట బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే రెండో టీ ట్వంటి మ్యాచ్ లో భాగంగా హ‌ర్ష‌ల్ ప‌టేల్ తుది జ‌ట్టు లో కి వ‌చ్చాడు. అయితే మొద‌టి టీ ట్వంటి మ్యాచ్ లో మ‌హ్మ‌ద్ సిరజ్ కు గాయం కావ‌డం తో రెండో మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ రాంచీ వేదిక గా నిర్వ‌హిస్తున్నారు. అయితే రాంచీ లో ని స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. అలాగే స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉంటుంది. రెండు దేశాల తుది జ‌ట్ల వివరాలు

ఇండియా : రోహిత్ శ‌ర్మ (కెప్టెన్ ), రిష‌బ్ పంత్ ( వికెట్ కీప‌ర్ ), కెఎల్ రాహుల్, సూర్య కుమార్ యాద‌వ్, శ్రేయ‌స్ అయ్యార్, వెంక‌టేష్ అయ్యార్, అక్ష‌ర్ ప‌టేల్, ర‌వి చంద్ర‌న్ అశ్విన్, భూవ‌నేశ్వ‌ర్ కుమార్, దీప‌క్ చాహ‌ర్, హ‌ర్ష‌ల్ ప‌టేల్.

న్యూజిలాండ్ : టీమ్ సౌతీ (కెప్టెన్‌), టీమ్ సీఫెర్ట్ ( వికెట్ కీప‌ర్‌), మార్టిన్ గ‌ప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మ‌న్, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీష‌మ్, మిచెల్ సాంటర్న్, ఇష్ సోధి, ఆడ‌మ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్.

Read more RELATED
Recommended to you

Latest news