IPL 2023 : రిటైర్మెంట్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

-

కోల్కత్తా తో జరిగిన మ్యాచ్ లో చెన్నై గెలుపొందగా… చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చారు. ‘ఈడెన్ గార్డెన్స్ కు వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారు నాకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారు’ అని ధోని చెప్పడంతో… ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ధోని రిటైర్ అయితే ఆయన లేకుండా ఐపిఎల్ ను ఊహించలేము అని ట్విట్స్ చేస్తున్నారు.

కాగా నిన్న కేకేఆర్ పై చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అవలీలగా కోల్కత్తా జట్టుపై విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇది ఇలా ఉండగా అటు..ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో బెంగ‌ళూరు 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version