క్రికెట్ లో తీవ్ర విషాదం..ఐసీసీ మాజీ అంపైర్‌ రౌఫ్ మృతి

-

క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఐసీసీ మాజీ అంపైర్‌ మరణించారు. పాకిస్థాన్‌ దేశానికి చెందిన అసద్‌ రౌఫ్‌ గుండెపోటుతో తాజాగా మరణించాడు. అసద్‌ రౌఫ్‌ వయస్సు 66 సంవత్సరాలు. అయితే.. తాజాగా ఆయనకు గుండెపోటు రావడంతో.. మరణించినట్లు సమాచారం అందుతోంది. కాగా.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ లో 170 మ్యాచ్‌ లకు ఆయన అంపైరింగ్‌ చేశారు.

ఆన్‌ ఫీల్డ్‌ తో కలిపి.. 64 టెస్టులు, 139 వన్డేలు, 29 టీ 20 మ్యాచ్‌ అసద్‌ రౌఫ్‌ లిస్టులో ఉన్నాయి. విజయవంతమైన అంపైర్‌ గా పేరుతెచ్చుకున్న అసద్‌ రౌఫ్.. ఐపీఎల్‌ లోనూ అంపైర్ గా పనిచేశారు. 2013 లో ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో బీసీసీఐ అసద్‌ రౌఫ్‌ ను.. నిషేధించింది. ఆ తర్వాత అంపైరింగ్‌ చేసేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం పాక్‌ లో ఓ బట్టల షాప్‌ నడిపిస్తున్నాడు అసద్‌ రౌఫ్‌. ఇక అసద్‌ రౌఫ్‌ మృతి నేపథ్యంలో.. ఐసీసీ సంతాపం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version