టీ20 మహిళల వరల్డ్ కప్‌లో వారికి ఉచిత ప్రవేశం!

-

యూఏఈ వేదిక‌గా జరిగే ఐసీసీ మహిళల వరల్డ్ కప్ టీ20 టోర్నమెంట్ అక్టోబ‌ర్ 3 ప్రారంభం కానుంది. అయితే, అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వ‌ర‌కు మొత్తం 23 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సందర్భంగా మ్యాచ్‌‌ను వీక్షించేందుకు టికెట్ ధ‌ర‌ల‌ను ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించింది. టికెట్ ప్రారంభ ధ‌ర‌ను 5 దిర్హ‌మ్స్ (రూ. 114.28)గా నిర్ణ‌యించింది.అయితే, 18 ఏళ్లలోపు వ‌య‌సు క‌లిగిన వారికి ఉచిత ప్రవేశం కల్పించింది. యూఏఈలో ప్ర‌పంచ న‌లుమూల‌ల‌కు చెందిన ప్ర‌జలు ఉంటారు. వారు మ్యాచుల‌కు హాజ‌రై త‌మ దేశ క్రికెట‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ఇలా ఉచిత ప్ర‌వేశంతో పాటు త‌క్కువ ధ‌ర‌ల‌కే టికెట్లు విక్ర‌యించాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఐసీసీ వెల్లడించింది.

కాగా, మహిళల టీ20 ప్రపంచ కప్ మెగా ఈవెంట్‌లో మొత్తం 10 దేశాలు పాల్గొననున్నాయి.వీటిని రెండు గ్రూపులుగా విభ‌జించారు.గ్రూప్‌-ఏలో భార‌త్‌తో పాటు న్యూజిలాండ్‌, శ్రీలంక‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఉండగా, గ్రూప్-బిలో ఇంగ్లండ్‌, ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.ఒక గ్రూప్‌లోని ప్ర‌తీ జ‌ట్టు ఇత‌ర జ‌ట్ల‌తో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మొత్తంగా టాప్-2లో నిలిచిన దేశాలు సెమీస్‌కు బెర్త్ చేసుకోనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news