గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా శుబ్మాన్ గిల్ !

-

2022 నుండి గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ మరియు ప్లేయర్ గా ఉన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ను నిన్న జరిగిన స్వాప్ పద్ధతిలో ముంబై ఇండియాను తిరిగి దక్కించుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ నుండి హార్దిక్ పాండ్య వెళ్లగా ముంబై నుండి కెమరూన్ గ్రీన్ వచ్చాడు. ఇది నిజంగా క్రికెట్ ప్రేమికులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇక హార్దిక్ పాండ్య రూపంలో గుజరాత్ కెప్టెన్ వెళ్లిపోవడంతో ఇమ్మీడియేట్ గా జట్టు యాజమాన్యం తమ తదుపరి కెప్టెన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో మొదటిసారి టైటిల్ ను గెలవడంతో కీలక పాత్ర పోషించిన యంగ్ ప్లేయర్ శుబ్ మాన్ గిల్ ను గుజరాత్ కెప్టెన్ గా నియమించింది.

ఇప్పుడు గిల్ పై అదనపు బాధ్యత పడినట్లు.. మరి ఏ విధంగా టీం ను ఒక బ్యాట్స్మన్ గా మరియు సారధిగా ముందుకు తీసుకు వెళుతాడు అన్నది వచ్చే ఐపీఎల్ సీజన్ లో తెలుస్తుంది. ఇక హార్దిక్ లేని లోటు ఎప్పటికీ గుజరాత్ కు తీరనిది అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news