IPL 2024: చెన్నైపై గుజరాత్ ఘన విజయం

-

Gujarat Titans won by 35 runs: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా నిన్న కీలక ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో..చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్. ఏకంగా 35 పరుగుల తేడాతో చెన్నైని మట్టి కరిపించింది గుజరాత్. నిర్ణీత 20 ఓవర్లలో 232 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్. అయితే ఆ లక్ష్యాన్ని చేదించడంలో… చెన్నై సూపర్ కింగ్స్ చతికిల పడింది.

Gujarat Titans won by 35 runs

దీంతో ఎనిమిది వికెట్లు నష్టపోయి 196 పరుగులు మాత్రమే చేసింది చెన్నై. దీంతో 35 పరుగులు తేడాతో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మిచ్చెల్ 63 పరుగులు చేశాడు. మొయిన్ అలీ 56 పరుగులు చేసి రాణించారు. అటు చివర్లో మహేంద్రసింగ్ ధోని 26 పరుగులు చేసినా కూడా మ్యాచ్ గెలవలేదు. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు విజయం సాధించడంతో… ప్లే ఆఫ్ కోసం తలపడే జట్ల మధ్య పోటీ పెరిగింది. ప్లే ఆఫ్ లోని నాలుగవ స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెంట్స్ పోటీ పడుతున్నాయి. నిన్న గుజరాత్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తే.. చెన్నై కచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్ళేది. అని అవకాశాన్ని కోల్పోయింది చెన్నై.

Read more RELATED
Recommended to you

Exit mobile version