ఐపీఎల్: భువి వెళ్ళాడు.. హోల్డర్ వచ్చాడు.

-

డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ టోర్నమెంట్ కి దూరం అవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో నడుముకి గాయం అయిన కారణంగా టోర్నమెంట్ కి దూరం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ టీమ్ కి పెద్ద లాస్ అనే చెప్పాలి. ట్వంటీ ట్వంటీలో చివరి ఓవర్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరి ఓవరే మ్యాచ్ ని నిర్ణయిస్తుంది. మరి అందులో ప్రత్యేకత చాటుకున్న భువనేశ్వర్ టోర్నమెంట్ కి దూరమవడం జట్టుకి నష్టమే.

ఐతే ఆ నష్టాన్ని పూడ్చడానికి వెస్టిండీస్ ఆల్ రౌండర్ హోల్డర్ వస్తున్నాడు. అటు బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ తనదైన సత్తా చాటే హోల్డర్ భవనేశ్వర్ ని మరిపిస్తాడా లేదా చూడాలి. వచ్చే మ్యాచ్ లో హోల్డర్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. మరి అతని రాక సన్ రైజర్స్ కి ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version