ఫాలో అన్ ఆడి గెలిచిన జార్ఖండ్… సరికొత్త చరిత్ర…!

-

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో జార్ఖండ్ చరిత్ర సృష్టించింది. ఫాలో ఆన్ ఆడి ప్రత్యర్ధిని ఓడించిన జట్టుగా చరిత్రలో నిలిచింది ఆ జట్టు… రంజీ ట్రోఫీలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించింది జార్ఖండ్ జట్టు. వివరాల్లోకి వెళితే ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన త్రిపుర జట్టు… కెప్టెన్ మిలింద్… హర్మీత్ సింగ్ అర్ధ సెంచరీలు చేయడంతో… తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 298 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఝార్ఖండ్ జట్టుకి… త్రిపుర బౌలర్లు చుక్కలు చూపించారు.

త్రిపుర బౌలర్లలో రానా… 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు… అభిజిత్ 43 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడంతో 136 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. దీనితో 153 పరుగుల ఆధిక్యంలో ఉన్న త్రిపుర… జార్ఖండ్ ని ఫాలో ఆన్ ఆడించాగా… కెప్టెన్ సౌరభ్ తివారి… 129 పరుగులతో… ఇషాంక్‌ జగ్గీ 107 పరుగులతో చెరొక సెంచరి చేయడంతో 8 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన త్రిపుర జట్టుకి జార్ఖండ్ కోలుకోలేని షాక్ లు ఇచ్చింది.

జార్ఖండ్ బౌలర్లలో ఆశిష్ కుమార్ 67 పరుగులకే ఆరు వికెట్లు తీసి చెలరేగడంతో 49 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది… ఆ తర్వాత మణిశంకర్ 103 పరుగులతో జట్టుని గట్టెక్కించే బాధ్యత తీసుకున్నా… ఇతర బ్యాట్స్మెన్ సహకారం లేకపోవడంతో జట్టు ఓటమి పాలైంది. ఫాలో ఆన్ ఆడుతూ కూడా ఊహించని స్కోర్ చేసిన జార్ఖండ్ జట్టు 54 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఫాలో ఆన్ ఆడుతూ విజయం సాధించిన జట్టుగా రికార్డ్ సాధించింది. ఇప్పుడు ఆ జట్టుపై సోషల్ మీడియాలో అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news