T20 World cup : పాక్ జట్టు మెంటర్‌గా హేడెన్

-

పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్ టి20 ప్రపంచ కప్ మాత్యు హెడెన్ ను సహాయక సిబ్బందిగా నియమించుకుంది. గత సంవత్సరం హెడేన్ పాక్ తరపున పనిచేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా జట్టు మొంటార్ గా చేరనున్నాడు. ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్ ఇతరులతో కలిసి మొంటార్ బాధ్యతలను హెడెన్ పోషించనున్నాడు.

రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో క్రికెట్ అయినా హెడేన్, బ్రిస్బెన్ లో అక్టోబర్ 15న పాకిస్తాన్ జట్టుతో చేరనున్నాడు. ఈసారి టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉన్నందున పాకిస్తాన్ జట్టుకు హెడేన్ సహకారం కాస్త సానుకూల అంశంగా మారనుంది.

గత టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ సెమీఫైనల్ వరకు వెళ్ళింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో సెమీఫైనల్ లో నాటకీయ పరిస్థితుల్లో ఓడిపోయింది. ఈ ఏడాది పాకిస్తాన్ జట్టు మంచి ఫామ్ లో ఉంది. దీంతో రెండో టి20 వరల్డ్ కప్ గెలవాలనే కసితో ఆ జట్టు ఉంది. ఆసియా కప్ లో ఇప్పటికే పాకిస్తాన్ ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ లో శ్రీలంక వర్సెస్ పాక్ తలపడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news