నమీబియా పై ప్రతికారం తీర్చుకున్న నేపాల్..!

-

స్థానికంగా జరుగుతున్న టీ20 ట్రై సిరీస్ లో నేపాల్ జట్టు బోణీ కొట్టింది. నమీబియాతో  జరిగిన మ్యాచ్లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో నమీబియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

ముఖ్యంగా  కుశాల్ మెండిస్ (55 నాటౌట్) మెరుపు అర్ధసెంచరీతో రాణించాడు. ఆరిఫ్ షేక్ (31), అనిల్ షా (23), గుల్షన్ షా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నమీబియా బౌలర్లలో బెన్ షికోంగొ 3, జాక్ బ్రస్సెల్ 2, ట్రంపల్మెన్, లాఫ్టీ ఈటన్, బెర్నాల్డ్ తలో వికెట్ పడగొట్టారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

స్మిట్ (50) అర్ధసెంచరీతో చెలరేగినా నమీబియాను గెలిపించలేకపోయాడు. చివర్లో జేన్ గ్రీన్ (23), బెర్నాల్డ్ (4 నాటౌట్) సైతం నమీబియాను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. నేపాల్ బౌలర్లలో కరణ్, సోమ్ఫాల్, దీపేంద్ర సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అభినాశ్ బొహారా ఓ వికెట్ దక్కించుకున్నాడు

Read more RELATED
Recommended to you

Latest news