దిల్లీ క్యాపిటల్స్ షాకింగ్ డెసిషన్.. పాంటింగ్ పై వేటు

-

 ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు హెడ్​కోచ్ రికీ పాంటింగ్​ను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. 7 సీజన్​ల తర్వాత దిల్లీ క్యాపిటల్స్ రికీ పాంటింగ్​ను వదులుకుంటుందని.. పాంటింగ్​తో జర్నీ అద్భుతం థాంక్యూ కోచ్ అంటూ ఎక్స్ లో పోస్టు పెట్టింది.

2018లో రికీపాంటింగ్ దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో చేరాడు. అప్పట్నుంచి దిల్లీకి హెడ్​ కోచ్​గా బాధ్యతలు స్వీకరించిన పాంటింగ్ 2024 ఐపీఎల్​ దాకా ఆ పదవిలో కొనసాగాడు. ఈ 7సీజన్లలో దిల్లీని ఛాంపియన్​గా నిలపడంలో పాంటింగ్ విఫలమయ్యాడు. కోచ్​గా బాధ్యతలు స్వీకరించిన తొలి సీజన్​లోనే జట్టు ఆఖరి స్థానంలో నిలవగా, 2019లో ప్లేఆఫ్స్, 2020లో ఫైనల్​కు, ఆ తర్వాత 2021లో ప్లేఆఫ్స్​కు చేరిన దిల్లీ, 2022, 2023, 2024 సీజన్​లలో టాప్-4లో నిలవలేకపోయింది. ప్రస్తుతం దిల్లీకి డైరెక్టర్‌గా ఉన్న సౌరభ్‌ గంగూలీ హెడ్ కోచ్‌ పదవి దక్కే ఛాన్స్ ఉంది.  కొత్త కోచ్ గురించి త్వరలోనే ప్రకటన రావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news