ఆ రోజు రితిక ఎందుకు ఏడ్చిందో చెప్పిన రోహిత్…!

-

టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ మైదానంలో ఆడుతున్నాడు అంటే అతని భార్య రితికా చేసే సందడి అంతా ఇంతా కాదు. రోహిత్ సిక్స్ కొట్టినా అవుట్ అయినా సరే కెమెరాలు ఆమె వైపు చూపిస్తూ ఉంటారు. ఆమె కూడా చాలా వరకు సందడి చేస్తూ మీడియాలో ఏదోక రూపంలో కనపడుతూ ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకునే పరిస్థితి ఉంటుంది.

ఎందుకు పెట్టుకుంటుంది ఏంటీ అనేది పక్కన పెడితే ఒకసారి రోహిత్ విషయంలో మైదానంలో ఆమె కన్నీళ్లు పెట్టింది. దీనిపై రోహిత్ తాజాగా ఒక విషయం చెప్పాడు. 2017లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ మూడో డబుల్ సెంచరీని సాధించగా అదే రోజు అతని రెండో వివాహ వార్షికోత్సవం కూడా. రోహిత్ డబుల్ సెంచరీని సమీపిస్తున్న సమయంలో స్టాండ్స్‌లో అతని భార్య రితిక కాస్త కన్నీరు పెట్టుకుంది.

తాజాగా దీనికి సంబంధించి రోహిత్ కీలక విషయం చెప్పాడు. మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో నేను తనని ఎందుకు ఏడ్చావు అని అడిగా అని… 196వ పరుగు కోసం నేను డైవ్ చేయాల్సి వచ్చిందని… దీంతో నా చెయ్యి మెలిక పడింది అని తను అనుకోని ఏడ్చనని నాకు చెప్పిందని రోహిత్ పేర్కొన్నాడు. ఆమె చాలా సున్నితమైన వ్యక్తిని… అదే కారణం అనుకుంటా అని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news