IPL 2024 : లక్నో సూపర్‌ జెయింట్స్‌ లోకి సురేష్ రైనా !

-

IPL 2024 : ఐపీఎల్-2024 సీజన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే… ఐపీఎల్-2024 సీజన్ కు ముందు లక్నో సూపర్ జేయింట్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు మెంటార్ గా టీమిండియా మాజీ ఆటగాడు సీఎస్కే లెజెండ్ సురేష్ రైనాను నియమించేందుకు ఎల్ ఎస్ జి సిద్ధమైనట్లు సమాచారం.

Suresh Raina Hints At Returning To IPL 2024 For KL Rahul’s LSG

ఇప్పటికే అతడితో లక్నో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రైనా చేసిన ట్వీట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ‘లక్నో ఫ్రాంచైజీతో రైనా ఒప్పందం కుదుర్చుకోలేదని, అవన్నీ తప్పుడు వార్తలేనని’ ఓ జర్నలిస్టు ఓ ట్వీట్ చేశాడు. అందుకు రైనా స్పందిస్తూ…. ఈ వార్తలు ఎందుకు నిజం కాకూడదు? అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో సురేష్ రైనా ను కొత్త అవతారం లో చూడడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news