రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ మురళి విజయ్

-

టీపిండియా క్రికెటర్ మురళి విజయ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతూ మురళి విజయ్ సోమవారం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రపంచ క్రికెట్ లో కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

భారత్ తరఫున మొత్తం 61 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన మురళి విజయ్ 3,982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 17 మ్యాచుల్లో 339 రన్స్, టి 20 లో తొమ్మిది మ్యాచ్లో 169 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో 106 మ్యాచుల్లో రెండు సెంచరీలు, 13 ఆఫ్ సెంచరీలతో 2,619 పరుగులు చేశాడు. మురళి విజయ్ చివరిసారిగా 2018 డిసెంబర్ లో ఇండియాకి ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో అతడు తన చివరి టెస్ట్ మ్యాచ్ లో కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news