టీ20 వరల్డ్ క‌ప్ లో భారత్, పాకిస్థాన్ బలబలాలు..!

-

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. టి20 2024 ప్రపంచ కప్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. గ్రూప్ ఏ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 19 వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్ లోని ప్రముఖ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది.

Today is another important match between Team India vs Pakistan

అయితే..టీ20 వరల్డ్ క‌ప్ లో భారత్, పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏడుసార్లు తలపడగా… ఆరు సార్లు విజయం సాధించింది భార‌త్. ఒక్క‌సారి మాత్రమే గెలిచింది పాక్. ఇక ఇవాళ కూడా టీమిండియాకే గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అయితే… ఈ మ్యాచ్‌ నేపథ్యంలో…న్యూయార్క్ పిచ్ అందరినీ టెన్షన్ పెడుతోంది. ఈ పిచ్ లో జరిగిన తొలి మ్యాచ్‍లో సౌతాఫ్రికాపై శ్రీలంక 77 పరుగులకే ఆలౌట్ అయింది. పిచ్ సమాంతరంగా లేకపోవటంతో రకరకాలుగా బౌన్స్ అవుతోంది బాల్. దీంతో రెండు జట్లు భయపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news