పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఊహించని షాక్.. భారత్ వైపే ఐసీసీ

-

భారత్ తో మ్యాచ్ సందర్భంగా అహ్మాదాబాద్ లోని ప్రేక్షకులు పాకిస్తాన్ ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారని పాక్ క్రికెట్ బోర్ు ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. పాకిస్తాన్ జర్నలిస్టుల వీసాల ఆలస్యం చేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. టాస్ సమయంలో బాబర్ పిచ్ ని పరిశీలిస్తున్నప్పుడు ప్రేక్షకులు అతడిని టార్గెట్ చేశారని.. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ స్క్వా్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.

పాకిస్తాన్ బోర్డుకు ఐసీసీ షాక్ ఇస్తూ.. ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. వివక్ష వ్యతిరేక కోడ్ యొక్క పరిధి వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయబడినందున పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క ఫిర్యాదుపై ఐసీసీ ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. దీంతో ఏదో చేసేద్దామనుకున్న పాక్ క్రికెట్ బోర్డుకి నిరాశ తప్పలేదు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పాక్ పై గెలిచింది. ఇవాళ బంగ్లాదేశ్ పై కూడా భారత్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news