ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు రూ.11.45 కోట్లు.. కోహ్లీ రియాక్షన్ ఏంటో తెలుసా..?

-

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. గ్రౌండ్​లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ పాపులారిటీ ఉన్న ఆటగాడు విరాట్. ఈ స్టార్ ప్లేయర్ ఫాలోవర్స్ సంఖ్యను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా విరాట్ కోహ్లీ సోషల్ మీడియా సంపాదనపై రకరకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ వార్తలపై తాజాగా విరాట్ స్పందించాడు. తాను ఒక్కో పోస్ట్​కు తను రూ 11.45 కోట్లు వసూల్ చేయడం అవాస్తవమని తెలిపాడు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.”నా జీవితంలో పొందిన ప్రతిదానికీ నేను కృతజ్ఞతుడ్ని. అందుకు రుణపడి ఉన్నాను. కానీ నా సోషల్ మీడియా సంపాదన గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. అందులో ఎలాంటి నిజం లేదు.” అని విరాట్ ‘ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news