బంగ్లాదేశ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌ !

-

ప్రపంచ కప్-2022 టోర్నీల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్ ను కోచ్ గా నియమించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ వెల్లడించినట్లు ది డైలీ స్టార్ తన కథనంలో పేర్కొంది. “అవును, ప్రపంచ కప్ ఈవెంట్ వరకు మేము శ్రీరామ్ తో కలిసి పని చేయబోతున్నాం.

ఆసియా కప్ నుంచి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రధాన లక్ష్యం టి20 ప్రపంచ కప్. నిజానికి వరల్డ్ కప్ టోర్నీ సమయంలో ఈ నియామకం జరిగినట్లయితే, అప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకొని జట్టుతో ఏకమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆసియా కప్ ఈవెంట్ నుంచే జట్టుతో కలిసేలా ప్రణాళికలు వేశాం” అని సదరు అధికారి పేర్కొన్నట్లు డైలీ స్టార్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news