గుండెపోటుతో మృతి చెందిన శ్రీశైలం దేవస్థానం వేదపండితుడు జగన్నాథశర్మ..!

-

శ్రీశైలం దేవస్థానం వేద పండితుడు జగన్నాథశర్మ గుండెపోటుతో చనిపోయారు. ఇక అసలేం జరిగిందనేది చూస్తే.. శ్రీశైలం దేవస్థానం వేద పండితుడు జగన్నాథశర్మ విధులలో ఉండగా చాతి లో నొప్పి రావడం వలన దేవస్థానం వైద్యశాలకు తీసుకు వెళ్లారు.

ఆ తరవాత అక్కడ నుండి మెరుగైన వైద్యానికి విజయవాడకు తరలిస్తుండగా మార్గం మధ్య లోనే ఆయన మృతి చెందారు. జగన్నాథశర్మ మృతి కి దేవస్థానం ఉద్యోగులు, సహచరులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news