ఆస్కార్ వేదికపై నాటు నాటు.. పర్ఫామెన్స్ చూసి చిన్నపిల్లాడిలా రాజమౌళి కేరింతలు

-

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 2023 ఆస్కార్‌ అవార్డుల వేడుకఅట్టహాసంగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు ఈ వేడుకకు తరలివచ్చారు. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా పాట సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట లైవ్ పర్ఫామెన్స్ జరిగింది. ఈ పాటను ఆస్కార్ వేదికపై బాలీవుడ్ దివా దీపికా పడుకోన్ ఇండ్రడ్యూస్ చేసింది. ఆ పాట నేపథ్యాన్ని, అవార్డుల వేడుకకు హాజరైన వారికి వివరించింది.

ఆస్కార్‌-2023 వేడుకల్లో తెలుగు పాట ‘నాటు నాటు’ అదరగొట్టింది. ఈ పాటను ఒరిజినల్​గా పాడిన గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌లో పాడారు. వారి పాటకు వెస్ట్రన్‌ డ్యాన్సర్‌ తమ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. ఈ పాట ప్రదర్శన సమయంలో ఆస్కార్‌ వేడుకకు వేదికైన డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. పాట పూర్తవ్వగానే అక్కడున్న తారలంతా లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. నాటు నాటు పర్ఫామెన్స్ పూర్తవ్వగానే ఆడియెన్స్​తో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా తన సీటులో నుంచి లేచి చప్పట్లు కొట్టారు. రాజమౌళి చిన్నపిల్లాడిలా కేరితంలు కొడుతోన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news