Nara Lokesh : 24 నుంచి నారా లోకేష్ యువగళం ప్రారంభం

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మళ్లీ పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారా ? అంటే అవుననే అనిపిస్తోది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై మరోసారి చర్చ జరుగుతోంది. లోకేష్ యువగలం పాదయాత్రను ఈ నెల 24న మళ్లీ ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Starting from 24 Nara Lokesh Yuvagalam

తాజా పరిణామాలను బట్టి లోకేష్ పాదయాత్రను విశాఖతో ముగించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ యాత్ర ఇచ్చాపురం వరకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు విశాఖతోనే ముగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు తన పాదయాత్రను విశాఖలోనే ముగించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో లోకేష్ కూడా విశాఖలోనే ముగించాలని అనుకుంటున్నారు. కాగా ఇటీవలే చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news