రాష్ట్రాన్ని రావ‌ణ‌కాష్టం చేస్తున్నారు : సీఎం జ‌గ‌న్‌పై నారా లోకేష్ ఫైర్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని సీఎం జ‌గ‌న్, ఆయ‌న పార్టీ నేత‌లు రావ‌ణ కాష్టం చేస్తున్నార‌ని టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగ ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ లో వైసీపీ నేత వెంక‌ట్రమ‌ణారెడ్డి ఒక మ‌హిళ‌ను హ‌త్య చేసి చంపాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్ లో స్పందించారు. హ‌త్య చేసిన వైసీపీ నేత, సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌లిసి ఉన్న ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్టు చేశారు. అనంత‌రం ప్ర‌భుత్వంపై, సీఎం జ‌గ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ys jagan on nara lokesh

క‌బ్జాలు, దోపిడీలు, అడ్డువ‌చ్చిన వారిని హ‌త్య చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారని విమ‌ర్శించారు. ప్ర‌జలు అధికారాన్ని క‌ట్ట‌బెట్టింది.. హ‌త్య‌లు చేయ‌డానికి లైసెన్స్ ఇచ్చార‌ని అనుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం దిశ వాహ‌నాల‌ను ప్రారంభించి మూడు రోజుల కూడా కాక‌ముందే.. స్వ‌యంగా అధికార పార్టీ నేత‌లే మ‌హిళ‌ల‌పై అత్యంత పాశ‌వికంగా హ‌త్యలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

అండ‌గా ఉండాల్సిన ప్ర‌భుత్వం.. హ‌త్య‌లు చేయిస్తుందా.. అని ప్ర‌శ్నించారు. అలాగే న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news