ఏప్రిల్ 7న హైదరాబాద్ లో విద్యుత్ సౌద ముట్టడిస్తాం : రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరిగాయి ఛాన్స్ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాదులోని విద్యుత్ సౌదను ముట్టడిస్తామని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

మార్చి 31 న సిలిండర్లు కు దండలు వేసి .. డప్పు చాటింపు వేస్తామని.. విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ మండల కేంద్రంలో…aede కార్యాలయం ల ముందు ఆందోళన లు చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 4 న మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు…ఉంటాయని.. అంబేద్కర్ విగ్రహం ముందు కెసిఆర్..మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 5 న కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన, ఏప్రిల్ 7 న… హైదరాబాద్ లో విద్యుత్ సౌద ముట్టడి ఉంటుందన్నారు.వరి కొనక పోతే..ఇద్దరినీ ఉరి వేయాల్సి వస్తుంది.. ఇద్దరు కలిసి రాజకీయ ప్రయోజనం కోసం రైతులను చంపుతున్నారని ఫైర్ అయ్యారు. ఇద్దరూ వ్యూహాత్మకంగా రాజకీయ దురాశ తో ఉన్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news