మళ్లీ బీజేపీని టార్గెట్ చేసిన సుబ్రమ్యస్వామి.. రోగ్ అంటూ !

-

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి కూడా తన సొంత పార్టీని ఆయన టార్గెట్ చేశాడు. బిజెపి ఐటి సెల్ ఒక రోగ్ లాగా అయిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ఐటీ సెల్ కు చెందిన కొందరు సభ్యులు నాపై వ్యక్తిగత దాడులు చేయడానికి నకిలీ ఐడిలు క్రియేట్ చేసి మరీ ట్వీట్ లు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇక ఇలానే చేస్తే కోపంతో ఉన్న నా అనుచరులు వ్యక్తిగత దాడులు చేస్తే అది తనకు ఆపాదించవద్దని ఆయన కోరారు. ఎలా అయితే ఈ బీజేపీ యొక్క రోగ్ ఐటి సెల్ తో తనకు సంబంధం లేదని బీజేపీ చెబుతుందో తను కూడా అలానే చెప్పాలి వస్తుందని పేర్కొన్నారు. మరి ఈ విషయం మీద బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news