విషాదం గా మారిన ప్రేమ..!

-

ప్రేమ అంటే ఒక మధురానుభూతి… ఎన్నో మరువలేని జ్ఞాపకాలను ఇస్తూ ఉంటుంది ప్రేమ. కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే ప్రాణాలు తీసే ఒక మహమ్మారి గా మారిపోయింది. ప్రేమ ను వదులుకోలేక పెద్దలను ఎదిరించలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు అని ఒక కారణంతో ఏకంగా తల్లిదండ్రులు కన్న వారిని దారుణంగా హత్య చేసిన ఘటనలు కూడా తెర మీదికి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. ఇలా ప్రేమ ఈ మధ్యకాలంలో బలి తీసుకుంటున్న ప్రాణాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి

dead body

ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు అనే కారణంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట నీటి కుంటlo దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా బంగారు పేట మండలం లో చోటుచేసుకుంది. సురేష్ రూప గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ తల్లిదండ్రుల ప్రేమను అంగీకరించలేదు… చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news