నాటుసారా అని సానిటైజర్ అమ్మాడు.. తాగిన నలుగురు చావుబతుకుల్లో ?

-

ఇదో వింత ఘటన తక్కువకు మందు దొరుకుతుంది కదా అని కొనుక్కుని తాగిన ఒక నలుగురు చావు బతుకుల్లో ఉన్నారు. వివరాల్లోకి వెళితే ధర్మవరం పట్టణంలో శానిటైజర్ తాగి నలుగురు వ్యక్తులు అపస్మారక స్థితి లో పడిపోయారు .ఈ సంఘటన ధర్మవరం రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది, కుటుంబ సభ్యులు సకాలంలో వాటిని ధర్మవరం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

అనంత సర్వజన ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో ఆ ఇద్దరు ప్రాణ పాయం నుంచి కోలుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి నాటు సారా అని తక్కువ ధరకు మద్యం అమ్మడంతో అది శానిటైజర్ అని తెలీక తాగమని బాధితులు చెబుతున్నారు. ఇక ఏపీలో మద్యం రేట్లు తగ్గించినా ఇలా చీప్ మందు కోసం వెంపర్లాడుతున్న కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news