బ్రేకింగ్: చిప్కో బహుగుణ ఇక లేరు

-

గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణ కరోనాతో ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. . చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు ఆయన. భార్యకు వచ్చిన ఆలోచనతో ఆయన ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మొదట 1970 లలో చిప్కో ఉద్యమంలో సభ్యుడిగా, తరువాత 1980 ల నుండి 2004 ప్రారంభం వరకు టెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు ఆయన.

1927 జనవరి 9 న ఉత్తరాఖండ్ లోని తెహ్రీ సమీపంలో మరోదా అనే గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. సత్యాగ్రహ పద్దతిలోనే ఆయన ఉద్యమాలు అన్నీ ఉండేవి. ఆయన మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news