నన్ను వరల్డ్ కప్ టికెట్లు ఆడగొద్దు: సూర్య కుమార్ యాదవ్

-

ప్రస్తుతం ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మ్యాచ్ లలో ఇప్పటికే 10 మ్యాచ్ లు పూర్తి కాగా ఈ రోజు 11వ మ్యాచ్ న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరుగుతోంది. కాగా సూర్య కుమార్ ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ను తన ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. మాములుగా ఇండియాలో మ్యాచ్ లు జరుగుతున్నాయి కాబట్టి తెలిసిన ప్లేయర్స్ ను స్నేహితులు, బంధువులు లేదా బాగా దగ్గర ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్ లను స్టేడియం లో ప్రత్యక్షముగా చూడడానికి టికెట్ లు అడుగుతుంటారు. అందుకే సూర్య కుమార్ యాదవ్ ముందు జాగ్రత్తగా ప్లీజ్ నన్ను ఎవరూ టికెట్లు ఆడగొద్దు.. టికెట్లు దొరక్కపోతే ఇంట్లో కూర్చుని హాయిగా టీవీ లలో చుడండి అంటూ సలహా ఇచ్చారు.

సూర్య కుమార్ నుండి ఈ ఊహించని మెసేజ్ కు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలో సూర్యను తుది జట్టులోకి తీసుకోలేదు.. కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడుతాడా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news