విషాదం…! సుశాంత్ మరణం జీర్ణించుకోలేక మైనర్ బాలిక మృతి..!

-

two of sushanth fans roped themselves
two of sushanth fans roped themselves

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశ వ్యాప్తంగా అందరినీ కలచివేస్తుంది. అతని మరణాన్ని జీర్ణించుకోలేని అభిమానులు ఇప్పటికీ అతనికి అతని కుటుంబానికి సంతాపం తెలియజేస్తూనే ఉన్నారు. సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోకముందే మరిన్ని దారునాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మరణించిన రెండు రోజులకే అతని అత్త కూతురు కూడా మృత్యువాత పడింది, ఇక మరునాడే సుశాంత్ అభిమాని ఒకరు ఊరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. సుశాంత్ మరణానికి నేటితో ఆరవ రోజు, ఆరు రోజులు కూడా ముగియకముందే తాజాగా మరో ఇద్దరు అభిమానులు ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఆత్మహత్య చేసుకున్నవారిలో 13 ఏళ్ల మైనర్ బాలిక కూడా ఉండటం ఇప్పుడు అందరినీ మరింత కలచివేస్తుంది.

వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని జోబ్రా ప్రాంతానికి చెందిన ఓ ఎనిమిదో తరగతి బాలిక సుశాంత్‌కు వీరాభామాని. సుశాంత్ మరణవార్త ఆమెను ఎంతగానో క్రుంగదీసింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడిన ఆమె అక్కడికక్కడే మరణించింది.    సుశాంత్‌కు తన కుమార్తె వీరాభిమాని అని, అతడి మరణాన్ని జీర్ణించుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలియజేశారు. ఇక సరిగ్గా ఇదే నేపద్యంలో కటక్‌లోని జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన నిరంజన్‌రెడ్డి (55) సుశాంత్ కు భారీ అభిమాని, సుశాంత్ మరణంతో క్రుంగిపోతున్న సుదురు వ్యక్తి తన కార్యాలయంలో ఉరివేసుకొని మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news