సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ అస్తమయం..

-

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ కన్నుమూశారు. లివర్ సిరోసిస్ తో బాధపడుతున్న స్వామి అగ్నివేష్, మంగళవారం రోజు నుండి వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఇతర సమస్యలు కూడా తోడవడంతో స్వామి అగ్నివేష్, ఇక పోరాటం చేయలేక దేహం వదిలారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన లివర్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన స్వామి అగ్నివేష్, కుటుంబాన్ని వదిలి సన్యాసాన్ని తీసుకున్నారు.

వెట్టిచాకిరిపై ఆయన చేసిన ఉద్యమం రాజకీయాల్లోకి తీసుకెళ్ళింది. 1977లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికైన అగ్నివేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకి ఆ పదవి నుండి బయటకి వచ్చారు. అన్నాహజారే చేపట్టిన ఉద్యమంలో స్వామి అగ్నివేష్ పాలుపందుకున్నారు. 2018లో అటల్ బీహారీ వాజ్ పేయికి నివాళి అర్పించడానికి వెళ్తుండగా మార్గమధ్యంలో అగ్నివేష్ పై దాడి జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news