శ్రీ రాముడు అక్కడే జన్మించాడు.. తేల్చిచెప్పిన స్వరూపానందేంద్ర..!

-

శ్రీరాముడి జ‌న్మ‌స్థ‌లం అయోధ్య నేపాల్‌లో ఉంద‌ని, రాముడు నేపాల్ దేశ‌స్తుడంటూ నేపాల్ ప్ర‌ధాని ఓలీ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. దీనిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్పందిస్తూ ఆ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ధ‌ర్మ‌ బ‌ద్ధ‌మైన జీవితాన్ని స‌మాజానికి అందించిన దివ్య‌మూర్తి శ్రీరాముడ‌ని కొనియాడారు. రాముడు భార‌త‌దేశంలో జ‌న్మించాడ‌నేందుకు ఎన్నో చారిత్ర‌క సాక్ష్యాలున్నాయ‌ని ఆయన తెలిపారు.

అటువంటి వాటిని వ‌క్రీక‌రించ‌డం స‌రికాదన్నారు.  చైనా ప్ర‌ధాని కుట్ర‌ల‌కు అనుగుణంగా నేపాల్ ప్ర‌ధాని న‌డుచుకోవ‌డం దారుణ‌మ‌ని, ఇక‌నైనా నేపాల్ త‌ప్పుడు ప్ర‌చారాన్ని మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. శ్రీరాముని జ‌న్మ‌స్థ‌లం గురించి తెలిసీ తెలియ‌ని మాట‌లు స‌రికాద‌ని స్వామి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news