బ్రేకింగ్: సిఎం రాజీనామా…!

-

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎఐఎడిఎంకె పరాజయం పాలవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి సోమవారం రాజీనామా చేశారు. పళనిస్వామి తన కార్యదర్శి ద్వారా సేలం నుండి రాజీనామా పంపారు. ఈ లేఖ మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్‌కు చేరుతుంది అని తమిళ మీడియా పేర్కొంది. గవర్నర్ కార్యాలయం దీనిపై ఇంకా స్పందించలేదు అని తమిళ మీడియా పేర్కొంది.

tamilnadu government initiated complete lockdown
tamilnadu government initiated complete lockdown

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె 125 సీట్లు గెలుచుకోగా, ఓ పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని ఎఐఎడిఎంకె 65 సీట్లు గెలుచుకున్నాయి. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిఎంకె ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. నిన్న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news