మళ్ళీ వార్తల్లో తార చౌదరి… అసలు ఏం జరిగింది…?

-

తారా చౌదరి… సరిగా పదేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన పేరు ఇది. సినిమాల్లో అవకాశాల కోసం అడుగుపెట్టి ఆ తర్వాత ఎటో వెళ్ళిపోయినా ఆమె జీవితం నేడు కుదుట పడింది. పెళ్లి చేసుకుని సెటిల్ అయింది ఆమె. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె వార్తల్లో నిలిచింది., తన భర్తను వేధిస్తున్నారని చెప్పింది ఆమె. తన భర్తను అకారణంగా కొట్టారని పామూరు ఎస్సై చంద్రశేఖర్ పై ఆమె ఆరోపణలు చేసారు.

నిత్యావసర సరుకులు, ఐదు నెలల తన బిడ్డకు మందులు తీసుకువచ్చేందుకు ఉదయం 8 గంటల సమయంలో బయటకు వెళ్లిన తన భర్త రాజ్ కుమార్ ను కొట్టి నాటసారా తాగి రవాణా చేస్తున్నట్లుగా అక్రమ కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. అడిగేందుకు వెళ్లిన తనను కూడా బొక్కలో వేస్తానంటూ ఎస్సై భయపెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తన భర్త రాజ్ కుమార్ పై పామూరు ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ కావాలనే కక్ష పూరితంగా దాడి చేశారని ఆరోపించారు ఆమె.

టార్గెట్ చేసి నాటు సారా తరలిస్తున్నట్లు, తాగినట్లు బ్రీతింగ్ టెస్ట్ సీన్ క్రియెట్ చేసి కేసు నమోదు చేశాడని మండిపడ్డారు. లాక్ డౌన్ సమయంలో తన సమస్యలు, ప్రజల ఇబ్బందులు ఎస్సై దృష్టికి తీసుకెళ్లటమే దీని అంతటికి కారణమని మండిపడ్డారు. వాటిని దృష్టిలో పెట్టుకొని కావాలనే తన భర్త రాజ్ కుమార్ బయట తిరుగుతున్న క్రమంలో టార్గెట్ చేసి కేసు పెట్టారని తారా చౌదరి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news