తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

-

నందమూరి తారకరత్న.. 39 సంవత్సరాల వయసులో గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూయడం నిజంగా బాధాకరం.. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం కోసం తారకరత్న జనవరి 27న కుప్పం వచ్చారు.. ఒక మసీదులో ప్రార్థనలు నిర్వహించి బయటకు వస్తుండగా.. కొంత దూరం నడిచిన తర్వాత ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. వెంటనే ఆయనను కుప్పం ఆసుపత్రికి తరలించారు.

కానీ అక్కడే మరణించాడు. కాగా తారకరత్న లేరన్న వార్తను ఆయన భార్య అలేఖ్యరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. భర్తతో పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘మనం కలిసి ఉండేందుకు ఎంతో పోరాడాం. చివరి వరకు పోరాడుతూనే ఉన్నాం. మన జీవితం పూలబాట కాదు. కార్లలో నిద్రపోయినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా దూరం ప్రయాణించాం. నువ్వో యోధుడివి. మమ్మల్ని నువ్వు ప్రేమించినట్లు ఎవరూ ప్రేమించలేదు’ అని భావోద్వేగానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news