వీడియోకాలింగ్‌ ఫీచర్‌తో సరికొత్త టీవీలు!

-

వీడియో కాలింగ్‌ సరికొత్త ఫీచర్‌తో కొత్త టీవీలు అందుబాటులో ఉన్న స్మార్ట్‌ టీవీల వివరాలు తెలుసుకుందాం. టీసీఎల్‌.. చైనాకు చెందిన కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ టీసీఎల్‌ ఇండియాలో మొదటిసారి ఆండ్రాయిడ్‌ 11 టీవీని విడుదల చేసింది. పీ725 హైఎండ్‌ టీవీ మోడల్‌లో వీడియో కాలింగ్‌ కెమెరా ఉండటం ఈ టీవీకి ఉండే ప్రత్యేకత. 43,50, 55, 65 ఇంచుల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.41,990–89,990 మధ్య ఉన్నాయి.

ప్రస్తుతం మన దేశంలో టీసీఎల్‌ కంపెనీకి సంబంధించి టీవీలు, ఏసీ ఉత్పత్తులు మాత్రమే లభ్యమవుతున్నాయి. దీన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉంది టీసీఎల్, అలాగే వేసవిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా బీఐజీ కేర్‌ అండ్‌ యూవీసీ స్టెరిలైజేషన్‌ ప్రొ ఏసీ ‘ఒకారినా’ను కూడా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.33,990.
ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా భారత్‌లోనే ఈ పీ725 టీవీని విడుదల చేశామని, ఇందులో 65 ఇంచుల టీవీని కేవలం అమెన్‌ లో విక్రయించనున్నట్లు టీసీఎల్‌ ఇండియా జీఎం మైక్‌ చెన్‌ తెలిపారు. అమెజాన్‌ ఇండియా టెలివిజన్, కేటగిరీ లీడర్‌ గారిమా గుప్తా మాట్లాడుతూ తమ వినియోగదారుల కోసం వీడియో కాల్‌ కెమెరాతో టీసీఎల్‌ తొలి 4 కేహెచ్‌డీఆర్‌ టీవీని తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అందిస్తున్న టీసీఎల్‌తో పార్టనర్‌షిప్‌ టీవీ విభాగంలో బలమైన పోర్ట్‌ఫోలియో తమ సొంతమన్నారు. ఆండ్రాయిడ్‌ టీవీలు కొత్త శ్రేణి అధునాతన లక్షణాలతో కొత్త, టీవీ అనుభవాన్ని అందిస్తాయన్నారు. ఈ సరికొత్త ఫీచర్లతో సాధార ణ ధరలకే టీసీఎల్‌ వీడియో కాలింగ్‌ టీవీలను అందుబాటులో ఉంచింది. వివిధ శ్రేణుల్లో అందుబాటులో ఉన్న ఈ టీవీలను వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని, మారుతున్న అభిరుచులకు తగ్గట్టు కొన్ని మార్పులను కూడా చేశామని సంస్థ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news