చంద్రబాబుని కామెడి చేస్తున్న టీడీపీ నేతలు…!

-

ఏదైనా విపత్తు వచ్చిన సమయంలో టీడీపీ అధినేత, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు సమర్ధులు అనే సంగతి అందరికి తెలిసిందే. అక్కడ వరకు బాగానే ఉంది గాని ఆయన గురించి ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తున్న భజన ఆయన్ను బాగా ఇబ్బంది పెడుతుంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఏదైనా చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేతలు పదే పదే చంద్రబాబు సామర్ధ్యం గురించి ఏదోక వ్యాఖ్య చేస్తూనే ఉన్నారు.

తాజాగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. వారం రోజులు జగన్ పరిపాలన నుంచి తప్పుకుని ముఖ్యమంత్రి బాధ్యతలను చంద్రబాబుకి అప్పగిస్తే కరోనా తగ్గిపోతుంది అని వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు గతంలో చేసిన పనుల గురించి సోషల్ మీడియాలో పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారో అర్ధం కాక టీడీపీ నేతలు తల పట్టుకుంటున్నారు.

రోజు రోజుకి కేసులు తీవ్రంగా అవుతున్నాయి. సలహాలు ఇవ్వాల్సిన చంద్రబాబు కూడా ఏవేవో లెక్కలు చెప్తూ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నారు. టీడీపీ నేతలు పదే పదే… మీడియా సమావేశాలకు ఏదోక రూపంలో హాజరు కావడం చంద్రబాబు భజన చేయడం అనేది అలవాటుగా మార్చుకున్నారు. పార్టీకి ఇలాంటివి నష్టం చేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఇవి చులకన అయ్యేలా ఉంటాయని కామెడి చేసే విధంగా ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news