-

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు ఈ మేరకు వేర్వేరుగా లేఖలు రాసిన ఆయన.. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యుడిగా నిలిచారని గుర్తు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ఐదుగురికి కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఆర్ పేరును కూడా పరిశీలించాలని టీడీపీ ఎంపీ కోరారు.

ఇటు సినిమాల్లో అటు రాజ‌కీయాల్లో స‌త్తా చాటిన నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భార‌తర‌త్న ఇవ్వాలని చాలాకాలం నుంచి టీడీపీ డిమాండ్ చేస్తున్న‌ విషయం తెలిసిందే.తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వం నినాదంతో టీడీపీ పార్టీని ప్రారంభించి జాతీయ రాజ‌కీయాల్లో సైతం స‌త్తా చాటిన నేత‌గా నటసార్వభౌమ ఎన్టీఆర్‌ అతి త‌క్కువ కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అరుదైన రికార్డు సృష్టించినాడు.

Read more RELATED
Recommended to you

Latest news