టీం ఇండియా గబ్బర్, ఆస్ట్రేలియా పాలిట దేవుడు

-

టీం ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియా పాలిట దేవుడు అయ్యాడు. క్యాచ్ లు వదిలేస్తూ అతను ఫీల్డింగ్ లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అతని ఫీల్డింగ్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్ళు అందరూ కూడా బ్రతికిపోయి భారీ స్కోర్ లు చేసారు. మొదటి రెండు వన్డేల్లో అతని ఫీల్డింగ్ వలనే టీం ఇండియా ఓడిపోయింది. మొదటి మ్యాచ్ లో స్మిత్ క్యాచ్ ని వదిలేసాడు.

రెండో మ్యాచ్ లో కూడా స్మిత్ క్యాచ్ వదిలేసాడు. ఈ రెండు మ్యాచుల్లో స్మిత్ సెంచరీలు చేసాడు. మూడో మ్యాచ్ లో ఫించ్ క్యాచ్ వదిలేసాడు. అతను 20 పరుగుల లోపు ఉన్న సమయంలో క్యాచ్ వదిలేసాడు. అతను 75 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ క్యాచ్ ధావన్ పట్టాడు. అప్పుడు కూడా చేతిలో పడిన క్యాచ్ జారిపోగా… మళ్ళీ వెంటనే అందుకుని తోడ కొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news