Telangana :కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం బీఆర్ఎస్‌కు లేదు :బోయినపల్లి వినోద్‌ కుమార్‌

-

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద రోజులలో అమలు చేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు అని ఆయన అన్నారు.జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య ఇంట్లో రసమయి బాలకిషన్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పని చేద్దాం అని మాట్లాడడం,కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అని హెచ్చరిక చేయడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు.39 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉందని తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోన్న బీఆర్ఎస్ పార్టీపై అనవసరంగా బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు సరికాదని..బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వినోద్ కుమార్ హితవు పలికారు. కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో ప్రజల ఆశీర్వాదంతో ఎన్నో గొప్ప పనులు చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తప్పకుండా ప్రశ్నిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news