హుజూరాబాద్ ఉప ఎన్నిక : పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

హుజురాబాద్ ఉప ఎన్నిక తరుముకొస్తున్న తరుణంలో బిజెపి నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ లో అసలు అభివృద్ధి జరగలేదని… నేను చేసిన అభివృద్ధి కనబడుతుందని పేర్కొన్నారు. ఎలక్షన్లు ఇప్పుడే రావని.. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఎవరు భారతీయ జనతా పార్టీకి వచ్చిన స్వాగతిస్తామని… ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. హుజురాబాద్ ను జిల్లా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

2014లో పోటీ చేస్తానని వచ్చానని.. అవకాశం రాలేదన్నారు. 2018లో పోటీ చేస్తానని వచ్చాను..అలవెన్స్ లో కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించారు కాబట్టి పోటీ చేయలేకపోయానని పెద్దిరెడ్డి తెలిపారు. ఈసారి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే.. తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news