తెలంగాణలో శాంతించిన కరోనా.. భారీగా తగ్గిన కేసులు

-

తెలంగాణలో లాక్ డౌన్ ను కెసిఆర్ సర్కార్ పటిష్టంగా అమలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. తెలంగాణలో మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 1280 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,03,369 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 15 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3484 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 21,137 గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 5,78,748 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 2261 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 95.91 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 94.50 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.57% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 91,621 పరీక్షలు చేశారు. ఇక అటు తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతుంది. ఇప్పటికే మెగా వ్యాక్సినేషన్లు వేగంగా ప్రారంభమయ్యాయి. సూపర్ స్ప్రెడర్లుగా భావించే వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news