“జమిలి” ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం !

-

దేశంలోని రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రస్తుతం వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి చర్చిస్తున్నారు. ఈ ప్రతిపాదనను తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వం… ఈ నెలలో జరగనున్న ప్రత్యేక సమావేశాల లో ఈ బిల్లును తీసుకొస్తున్నారు. కాగా ఈ జమిలీ ఎన్నికల గురించి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కాసేపటి క్రితమే కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లతో పాటు కొందరు ముఖ్యనేతల సమక్షములో భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఎలాగు పార్లమెంట్ లో అధిక బలం ఉన్నా బీజేపీ బిల్లును అడ్డుకోవడం జరగదు కాబట్టి… ఒకవేళ దేశం మొత్తం మీద ఎన్నికలు ఒకేసారి జరిగితే .. అందులోనూ అసెంబ్లీ మరియు పార్లమెంట్ లకు ఒకే సారి ఎన్నికలు వస్తే ఏ విధంగా తమ కార్యాచరణ ఉండాలి అన్న విషయంపైన ముఖ్యంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

మరి ఏ విధంగా సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తారు అన్నది రానున్న రోజుల్లో తెలియనున్చది.

 

Read more RELATED
Recommended to you

Latest news