తెలంగాణా కరోన : భారీగా తగ్గిన టెస్ట్ లు, తగ్గిన కేసులు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే ఈ రోజు మాత్రం కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి. ఎందుకంటే నిన్న ఆదివారం కావడంతో రోజూ చేసే టెస్ట్ లలో సగానికి సగం తగ్గిపోయాయి. దీంతో కరోనా కేసులు కూడా తక్కువగానే నమోదయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,021 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,13,084 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 6 గురు మరణించారు. ఇప్పటి వరకు 1228 మంది కరోనాతో మరణించారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 24,514గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,87,342 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,214 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 87.91% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 86.2% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 30,210 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 35,77,261 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 228 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version