తెలంగాణా కరోనా అప్డేట్.. 1,811 కేసులు, 9 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే నిన్నటిలానే ఈరోజు కూడా కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,811 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,10,346 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 2,10,346కు మంది మరణించారు. ఇప్పటి వరకు 9 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 26,104 గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,83,025 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,072 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 86.01% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 85.7 % శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 50,469 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 35,00,394 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 291 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news