తెలంగాణా కరోనా : 1,539 కేసులు, 5 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. మొన్న 1,637 కేసులు నమోదు కాగా తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న కాస్త తగ్గి 1,539 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,45,682 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు 1362 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18,656 ఉన్నాయి.

వారిలో 15,864 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,25,664 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 978 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 91.85% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 92.2% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.55%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 44,327 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 44,84,183 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 285 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news