తెలంగాణ కరోనా : 602 కేసులు, 3 మరణాలు

-

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. అయితే అది వైరస్ ప్రభావం తగ్గినందువలన అనుకునేరు. టెస్టులు తక్కువగా చేస్తుండడంతో కేసులు కూడా బాగా తగ్గుతున్నాయని చెప్పాలి. గతంలో రోజుకు అరవై వేల పరీక్షల దాకా చేసే వారు. కానీ నిన్న ఆదివారం కావడంతో ఇరవై వేల పరీక్షలు మాత్రమే  చేయడంతో కేసులు తగ్గాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 602కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,64,128 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు.

ఇప్పటి వరకు 1433 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11,227గా ఉన్నాయి. వారిలో 8,942 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో 2,51,468 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 1,015 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 95.20% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 93.7% శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 24,139 పరీక్షలు చేస్తే ఇప్పటివరకు 51,58,474 పరీక్షలు చేశారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 129 కేసులు నమోదయ్యాయి.

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news