తెలంగాణా కరోనా : 753 కేసులు, 3 మరణాలు

-

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. అయితే అది వైరస్ ప్రభావం తగ్గినందువలన అనుకునేరు. ఎందుకో కానీ టెస్టులు తక్కువగా చేస్తుండడంతో కేసులు కూడా బాగా తగ్గుతున్నాయని చెప్పాలి. గతంలో రోజుకు అరవై వేల పరీక్షల దాకా చేసే వారు. కానీ నలబై వేల పరీక్షలకు కాస్త అటూ ఇటుగా మాత్రమే  చేస్తుండడంతో వెయ్యిలోపే కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయం మీద కోర్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చినా తీరు మారలేదు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 753 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,68,418 కేసులు నమోదు అయ్యాయి.

ఇక నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకు 1451 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10,637గా ఉన్నాయి. వారిలో 8,459 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో 2,56,330 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 952 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 95.49% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 93.7% శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 41,991 పరీక్షలు చేస్తే ఇప్పటివరకు 53,74,141 పరీక్షలు చేశారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 133 కేసులు నమోదయ్యాయి. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version