తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 190 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు… రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు… ఇప్పుడు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో… కేవలం 190 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి.

దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,67, 725 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3929 మంది కరోనా మహమ్మారి తో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 4,288 గా ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,67, 56,608 కు చేరుకుంది.

ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,59, 508 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 245 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97. 95 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 42, 166 పరీక్షలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news